News Ticker

Menu

Latest Post

Cinema News

Gossips

News

Recent

First Look

Recent Posts

తాజా వార్తలు : 'బాహుబలి' కోసం యాక్షన్ మూడ్ లో తమన్నా

Tuesday / No Comments
Latest News Tamanna in action mode for baahubali movie : 

               Milky beauty Tamanna, will be seen in some heavy duty action sequences in Bahubali. The actress is excited about this as such sequences are first time for her. Although she has been in the industry for quite long, she hasn’t really done any action sequences in her career till date.

                The videos released pertaining to this movie have hinted on some major war sequences in this film. This movie has a massive cast with several biggies doing some crucial roles in this film.


                It will be interesting to see Tamanna in such role for the first time. We have seen Anushka carrying such roles with grace in her earlier movies. Only time will tell if Tamanna will be successful at this.

Latest News tamanna in action mode for baahubali movie :


          ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న తమన్నాఇప్పటి వరకు ఫైటులు, యాక్షన్ సన్నివేశాలలో నటించలేదు. కేవలం రొమాంటిక్ సన్నివేశాలు, పాటలకు మాత్రమె పరిమితమైంది. అయితే 'బాహుబలి' కోసం యాక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా.

          రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' సినిమాలో తమన్నా యాక్షన్ సన్నివేశాలలో కనిపించనుంది. వాటి గురించి ఈ అమ్మడు చాలా ఎగ్జైట్ మెంట్ గా ఎదురుచూస్తుంది. తమన్నా ఫైట్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.


           ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ఇటివలే డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు.

తాజా వార్తలు : 'లింగా' క్లైమాక్స్ కంప్లీట్ చేసిన రజినీకాంత్

/ No Comments

latest News rajinikanth completes lingaa movie climax

             కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా 'లింగా'. సెప్టెంబర్ 23, నేటితో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుతుంది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో షిమోఘ ఏరియాలో లింగనమక్కి డాం వద్ద క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

latest News rajinikanth completes lingaa movie climax
         
             'రజినీకాంత్ 'లింగా' సినిమా క్లైమాక్స్ లో భారి స్టంట్ సీక్వెన్స్ షూటింగ్ ఈ రోజుతో పూర్తవుతుంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు & టీంను మిస్ అవుతున్నాను ' అని యాక్షన్ సన్నివేశాల దర్శకుడు లీ ట్విట్ చేశారు.

క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ పూర్తవడంతో 'లింగా' మూవీ యూనిట్ త్వరలో యూరోప్ పయనం అవుతారు. అక్కడ అందమైన లొకేషన్ లలో పాటలను చిత్రీకరిస్తారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. రజిని బర్త్ డే కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు : నాగార్జున 'శివ'పై డాక్యుమెంటరీ తీసిన రామ్ గోపాల్ వర్మ

/ No Comments

Latest News RGV's documentary on shiva :

         నాగార్జున హీరోగా నటించిన 'శివ' సినిమా 1989, అక్టోబర్ 5న విడుదలయింది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు రామ్ గోపాల్ వర్మ. తన తొలిచిత్రంతోనే తెలుగుతెరపై ఒక సంచలనం సృష్టించారు. ఈ చిత్రం తెలుగు సినిమా గతిని, పరిస్థితి, దర్శకనిర్మాతల ఆలోచన విధానాన్ని మార్చింది. తొలిచిత్రంతో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రెండు నందులను కైవశం చేసుకుని చరిత్ర సృష్టించారు వర్మ. ఇప్పుడు ఈ చిత్రంపై వర్మ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు.

          యాక్షన్ సినిమాలకు కొత్త వరవడిని సృష్టించిన ఈ క్లాసిక్ విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో 'శివ'పై వర్మ డాక్యుమెంటరీ రూపొందించడం విశేషం. ఆ డాక్యుమెంటరీని 'శివ' విడుదలైన అక్టోబర్ 5న విడుదల చేస్తున్న వర్మ ట్విట్టర్ లో వెల్లడించారు. అప్పట్లో ఈ చిత్రం విజయం సాదించడంలో ఇళయరాజా సంగీతం, నాగార్జున నటన, వర్మ దర్శకత్వ ప్రతిభ తోడయ్యాయి.

Latest News rgvs documentary on shiva

            We all know what hype and hysteria Ram Gopal Varma's debut flick Shiva created. Now, after a long gap of 25 years, RGV is all set to make a documentary on the cult film. This short film will be released on the 5th of October which marks the silver jubilee year of its release.

            This documentary will feature exclusive behind the screens information, and various interviews from the cast and crew of the film. Also starring Amala as the female lead, Shiva was the film that capitulated RGV into the big league. The way it was shot, edited and directed was way ahead of its time, and gave new lease of life to Akkineni Nagajuna's career.


తాజా వార్తలు : ఎన్టీఆర్ సిన్సియర్ అవతార్ లో చూడవచ్చు

/ No Comments
Latest News jr NTR to be seen in sincere avatar

Latest News jr NTR to be seen in sincere avatar

               Young Tiger NTR is going into his next movie with Puri Jagan with high hopes. The movie will restart shooting from September 26th in Hyderabad and shots will be canned on NTR and the villains in this episode.

                NTR is going to be seen in a sincere police officer shade in this movie and he will also have bits of arrogance and attitude. The film is being produced by Bandla Ganesh and Devi Sri is the music director. Kajal Aggarwal will be seen as the heroine.


                 NTR’s characterisation is crucial for this movie as he has been going without a proper hit for a very long time now. His last film ‘Rabhasa’ disappointed fans along with movie lovers and NTR is determined to offer something new for the audience this time. 

తాజా వార్తలు : జూనియర్ ఎన్టీఆర్ 'రభస' క్లోజింగ్ కలెక్షన్స్...ఎంత? (ఏరియా వైజ్)

Monday / No Comments

Latest news jr ntr rabhasa closing collections,Total world wide collections of rabhasa

హైదరాబాద్ : బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం ‘రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కు లోటు ఉండదని భావించారు. 
అయితే ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం... ఇరవై రోజులకు Rs 27.50 కోట్లు కలెక్టు చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాకు ఇదే అత్యంత పూర్ కలెక్షన్ అని చెప్తున్నారు. ఈ చిత్రం క్లోజింగ్ బిజినెస్ లెక్కలు అందుబాటులో ఉన్న వాటిని అనుసరించి వేసినవి.
Latest news jr ntr rabhasa closing collections


ప్రాంతం కలెక్షన్ (షేర్)
 నైజాం Rs 6.87 కోట్లు 
సీడెడ్ Rs 4.80 కోట్లు 
ఉత్తరాంధ్ర Rs 2.20 కోట్లు 
గుంటూరు Rs 2.30 కోట్లు 
కృష్ణా Rs 1.30 కోట్లు 
తూర్పు గోదావరి Rs 1.42 కోట్లు 
 పశ్చిమ గోదావరి Rs 1.26 కోట్లు 
నెల్లూరు Rs 1.05 కోట్లు
 మొత్తం Rs 21.20 కోట్లు ( ఆంధ్రా మరియు తెలంగాణ కలిపి ) 
కర్ణాటక - Rs 3.50 కోట్లు 
 దేశంలో మిగతా ప్రాంతాలు - Rs 0.70 కోట్లు
 ఓవర్ సీస్ - Rs 2.10 కోట్లు 
 ప్రంపంచ వ్యాప్తంగా (షేర్): Rs 27.50 కోట్లు 
గమనిక: పైన చెప్పబడిన లెక్కలు కేవలం ట్రేడ్ లో చెప్పుకోబడుతున్నవి మాత్రమే. వీటికన్నా ఎక్కువ గానీ తక్కువ గాని కూడా ఉండే అవకాసం ఉంది.

తాజా వార్తలు : వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ: తల్లి వెల్లడి

/ No Comments

latest news paritala sriram to contest ensuing next elections,gossips about paritala sriram,News of paritala sriram

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫలా మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. పరిటాల కుటుంబం పేరుతో బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె సోమవారంనాడు హెచ్చరించారు.
         గత కొంత కాలంగా పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని పరిటాల సునీత అన్నారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి శ్రీరామ్‌కు ఇంకా కొంత సమయం అవసరమని చంద్రబాబు సూచించారు.

latest news paritala sriram to contest ensuing next elections,gossips about paritala sriram,News of paritala sriram


        చంద్రబాబు సూచనతో పరిటాల శ్రీరామ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదని అప్పట్లో వార్తాకథనాలు వచ్చాయి. అయితే, పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవి పేరు మీద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

        చాలా కాలంగా శ్రీరామ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ యువకులతో కొత్త టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారని, ఆ టీమ్‌లో శ్రీరామ్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి.

తాజా వార్తలు : యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది

/ No Comments


      హైదరాబాద్‌: టీజర్ సక్సెస్ ను బట్టే చిత్రం రేంజిని, బిజినెస్ ని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే దర్శకులు తమ చిత్రాల టీజర్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వాటికి ఎన్ని హిట్స్ వచ్చాయి అనేది ఎప్పటికప్పుడు గమనించుకుంటున్నారు. తాజాగా విక్రమ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఐ' యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
     అమీజాక్సన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ నుంచే కాక ఇండియాలో అన్ని భాషల వారి నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది.
     టీజర్‌లో విక్రమ్‌ను చూపించిన విధానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మరి ఇక సినిమాలో విక్రమ్‌ విశ్వరూపాన్ని చూడాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. యూట్యూబ్‌లో ఈ వీడియోకు హిట్లు 13 లక్షలకుపైగా దాటాయి.


దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు' అన్నారు. 

విక్రమ్‌ మాట్లాడుతూ 'శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. 


ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. 'అన్నారు.


తాజా గాసిప్స్ : ఎన్టీఆర్, పూరి కోల్డ్ వార్... ఫైనల్ గా

Sunday / No Comments

Latest Gossips jr ntr puri cold war came to an end,Latest Gossips of Jr Ntr,Puri Latest Gossips

హైదరాబాద్: ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరో,దర్శకుడు మధ్య ఇగో సమస్యలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. దాంతో సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కావాల్సింది మొదలు కాలేదు. అయితే తర్వాత సెప్టెంబర్ 15 నుంచీ షూటింగ్ మొదలు అవుతుందీ అన్నారు. అభిమానులను నిరాసపరుస్తూ అదీ కాలేదు. అయితే ఇదంతా గమనిస్తున్న నిర్మాత బండ్ల గణేష్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్యా సయోధ్య కుదుర్చినట్లు సమాచారం.

దాంతో సెప్టెంబర్ 22 నుంచీ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా హీరో,దర్శకుడు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కు ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే తను నష్టపోతానని భావించిన బండ్ల గణేష్ వెంటనే కార్యాచరణంలోకి దిగి, సెట్ చేసుకున్నట్లు చెవ్తున్నారు.

Latest Gossips jr ntr puri cold war came to an end


బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ప్రొడక్షన్స్ వారి 5 వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం భారీగా నిర్మించనున్నానని బండ్లగణేష్ చెప్తున్నారు. ఆంధ్రావాలా చిత్రం తర్వాత ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో చిత్రం రాలేదు. వీరి కాంబినేషన్ లో చిత్రం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు కానీ ఇన్నాళ్లకు కానీ వీలుపడలేదు. చిత్రానికి 'నేనో రకం' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ కి ఇదే ఉపశీర్షిక.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని చెప్తున్నారు. పూర్తి మాస్ మసాలాతో సాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రం నిర్మిస్తున్నారు. బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి.

వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Popular Posts